స్పేస్ నుంచి ట్వీట్ చేసిన యూఏఈ ఆస్ట్రోనాట్
- September 30, 2019
యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తొలిసారిగా ట్వీట్ చేశారు. ఐదు రోజుల క్రితం కజకిస్తాన్లోని బైకనూర్ నుంచి సోయుజ్ రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి హజ్జా చేరుకున్న విషయం విదితమే. తాను చేసిన తొలి ట్వీట్లో, ఐఎస్ఎస్కి సంబంధించిన ఫొటోని షేర్ చేశారు. క్షణాల్లో ఈ ట్వీట్కి లైక్లు, రీ-ట్వీట్లు, కామెంట్లు పోటెత్తాయి. యూఏఈ నుంచి తొలిసారి అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తిగా హజ్జా అల్ మన్సౌరి ఇప్పటికే రికార్డు సృష్టించిన విషయం విదితమే. అక్కడ ఆయన తన ప్రయోగాల్ని కొనసాగిస్తున్నారు. త్వరలో ఆయన తిరిగి భూమిని చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







