నిర్మాతగా మారుతున్న మెగాస్టార్ పెద్దల్లుడు
- September 30, 2019మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఉన్నారు. అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలో చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి నిర్మాత అయ్యేందుకు సిద్దం అయ్యాడు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భర్త ఎల్ వీ విష్ణు ప్రసాద్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలను తియ్యాలని నిర్ణయించుకున్నారు.
అయితే విష్ణు, సుస్మిత ఇద్దరు కలిసి ఫస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా ఓ వెబ్ సిరీస్ ను తీసి తర్వాత పెద్ద సినిమాలను తీయాలని భావిస్తున్నారు. అయితే వెబ్ సిరీస్ కు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. విష్ణు ప్రసాద్ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త. 2006లో విష్ణు, సుస్మిత వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. అయితే వెబ్ సిరీస్ లను అన్నీ భాషల్లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు విష్ణూ.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు