మన్మోహన్కు పాకిస్థాన్ ఆహ్వానం! మరి మోడీ?
- October 01, 2019
ఇస్లామాబాద్: నవంబర్లో జరిగే కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుకకు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషి చెప్పారు. పంజాబ్ రాష్ట్రం గురుదాస్పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ మందిరంతో కర్తాపూర్ కారిడార్ అనుసంధానం అవుతున్నది. ఎలాంటి వీసాలు లేకుండానే ఇక్కడికి భారతీయ పర్యాటకులకు పాకిస్థాన్ అనుమతిస్తున్నది. గతంలో రెండు ప్రభుత్వాల మధ్య ఈ మేరకు జరిగిన చర్చలు ఫలించాయి. భారతీయ సిక్కు పర్యాటకుల కోసం నవంబర్ 9వ తేదీన కర్తాపూర్ కారిడార్ను పాక్ ప్రారంభిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇస్లామాబాద్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకకు మన్మోహన్ సింగ్ను ఆహ్వానించడం సముచిత గౌరవంగా భావిస్తున్నామని, త్వరలోనే ఆయనకు ఆహ్వాన లేఖను పంపుతామని ఖురేషి తెలిపారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తాపూర్కు సిక్కు భక్తుల రాక తమకు ఎంతో సంతోషకరమని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







