మన్మోహన్కు పాకిస్థాన్ ఆహ్వానం! మరి మోడీ?
- October 01, 2019
ఇస్లామాబాద్: నవంబర్లో జరిగే కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుకకు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషి చెప్పారు. పంజాబ్ రాష్ట్రం గురుదాస్పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ మందిరంతో కర్తాపూర్ కారిడార్ అనుసంధానం అవుతున్నది. ఎలాంటి వీసాలు లేకుండానే ఇక్కడికి భారతీయ పర్యాటకులకు పాకిస్థాన్ అనుమతిస్తున్నది. గతంలో రెండు ప్రభుత్వాల మధ్య ఈ మేరకు జరిగిన చర్చలు ఫలించాయి. భారతీయ సిక్కు పర్యాటకుల కోసం నవంబర్ 9వ తేదీన కర్తాపూర్ కారిడార్ను పాక్ ప్రారంభిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇస్లామాబాద్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకకు మన్మోహన్ సింగ్ను ఆహ్వానించడం సముచిత గౌరవంగా భావిస్తున్నామని, త్వరలోనే ఆయనకు ఆహ్వాన లేఖను పంపుతామని ఖురేషి తెలిపారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తాపూర్కు సిక్కు భక్తుల రాక తమకు ఎంతో సంతోషకరమని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







