ల్యాండర్ విక్రమ్ పై ఇస్రో
- October 02, 2019
జులై 22 వ తేదీన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రునిపైకి చంద్రయాన్ 2 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. చంద్రుని వాతావరణంలోకి విజయవంతంగా ప్రవేశించిన ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా విక్రమ్ జాడ కనిపించలేదు. అయితే, ఆర్బిటర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ల్యాండర్ ముక్కలు కాలేదని, ఒక్కటిగా ఉందని సమాచారం అందింది.
అయితే, విక్రమ్ తో సంబంధాల కోసం చాలా ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. నాసా సహాయం తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. చంద్రునిపై ల్యూనార్ నైట్ వాతావరణం ఉన్నది. ఈ సమయంలో అక్కడ మైనస్ 248 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ల్యాండర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇస్రో తెలియజేసింది. ల్యాండర్ పై ఆశలు వదిలేసుకోలేదని, మరో వారం రోజుల్లో అక్కడ తిరిగి సూర్యకిరణాలు ప్రవేశిస్తాయి కాబట్టి ల్యాండర్ తో సంబంధాలను పునరుద్దరించే ప్రయత్నం చేస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







