'సైరా' రిలీజ్ సందర్భంగా విషాదం: మెగా అభిమానులకి తీవ్ర గాయాలు
- October 02, 2019సినిమా రిలీజ్ సందర్భంగా విషాద సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ప్రభాస్ సాహో రిలీజ్ సందర్భంగా ఓ అభిమాని థియేటర్ వద్ద ఫ్లెక్సీ కట్టే క్రమంలో విద్యుత్ షాక్ గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'సైరా' విషయంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకొంది. పేట్ బషీరాబాద్ లో సైరా ఫ్లెక్సీ కట్టే క్రమంలో అభిమానులకి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అభిమానులకి తీవ్ర గాయలయ్యాయి. మరో అభిమాని స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది.
వివరాల్లోకి వెఌతే.. కుత్బుల్లాపూర్ సర్కిల్, వాజ్పేయినగర్కు చెందిన కట్టా వెంకటేశ్ కుమారులు చిరంజీవి(30), రమేశ్(27)లు గార్డెనింగ్ పనులు చేస్తుంటారు. అదేవిధంగా లాజర్ కుమారుడు ప్రశాంత్(23) డిగ్రీ చదువుతున్నాడు. ఈ ముగ్గురికి సినిమాల పిచ్చి. సినిమాలు చూడటమే కాదు. సినిమా రిలీజ్ సందర్భంగా సొంత ఖర్చులతో ఫ్లెక్సీలు కడుతుంటారు. గత నెలలో విడుదలైన సాహో సినిమా సందర్భంగా ప్రశాంత్ నివాసం ముందు భారీ ఫ్లెక్సీ కట్టారు.
ఐతే, ఈరోజు సైరా విడుదల కానున్న నేపథ్యంలో సాహో ఫ్లెక్సీని తీసేసి.. సైరా ఫ్లెక్సిని కట్టాలని నిర్ణయించుకొన్నారు. సాహో ఫ్లెక్సీని తీసే క్రమంలో అది కాస్త విద్యుత్ తీగలకి తాగలడంతో షాక్ కి గురయ్యారు. ఈ ప్రమాదంలో చిరంజీవికితో పాటు రమేశ్కు తీవ్రగాయాలవగా ప్రశాంత్కు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రస్తుతం వీరిని హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అభిమానం ఉండొచ్చు కానీ.. ప్రాణాలు పోయేలా అభిమానం ఉండకూడదని స్టార్ హీరోలు చెబుతుంటారు. దాన్ని అభిమానులు మనసులో పెట్టుకొంటే మంచిదేమో. ముందు ఫ్యామిలీ. ఆ తర్వాతే సినిమాలు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు