హజ్జా టీమ్ భూమికి తిరిగొచ్చేందుకు సిద్ధం
- October 03, 2019
మరికొద్ది గంటల్లోనే హజ్జా అల్ మన్సౌరి భూమికి తిరిగి రానున్నారు. యూఏఈకి చెందిన తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్మన్సౌరి, సోయుజ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన విషయం విదితమే. అక్కడే కొద్ది రోజులపాటు వివిధ ప్రయోగాలు చేపట్టిన హజ్జా అల్ మన్సౌరితోపాటు అమెరికా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెక్సీ ఓవుచినిన్ భూమికి తిరిగి రానున్నారు. యూఏఈ సమయం ప్రకారం ఉదయం 10.30 నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీరి వాహక నౌక అన్ డాక్ అవుతుంది. కజకిస్తాన్లో వీరి స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి వీరిని హెలికాప్టర్లో తరలిస్తారు. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి యూఏఈ ఆస్ట్రోనాట్గా ఇప్పటికే రికార్డులకెక్కిన హజ్జా అల్ మన్సౌరి, అక్కడి నుంచి క్షేమంగా తిరిగొస్తున్న తొలి (తొలి ప్రయత్నంలోనే) యూఏఈ ఆస్ట్రోనాట్గానూ రికార్డ్ సృష్టించబోతున్నారు. ఆయనకి వెల్కమ్ చెప్పేందుకు యూఏఈతోపాటు, ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.
తాజా వార్తలు
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్









