హజ్జా టీమ్ భూమికి తిరిగొచ్చేందుకు సిద్ధం
- October 03, 2019
మరికొద్ది గంటల్లోనే హజ్జా అల్ మన్సౌరి భూమికి తిరిగి రానున్నారు. యూఏఈకి చెందిన తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్మన్సౌరి, సోయుజ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన విషయం విదితమే. అక్కడే కొద్ది రోజులపాటు వివిధ ప్రయోగాలు చేపట్టిన హజ్జా అల్ మన్సౌరితోపాటు అమెరికా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెక్సీ ఓవుచినిన్ భూమికి తిరిగి రానున్నారు. యూఏఈ సమయం ప్రకారం ఉదయం 10.30 నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీరి వాహక నౌక అన్ డాక్ అవుతుంది. కజకిస్తాన్లో వీరి స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి వీరిని హెలికాప్టర్లో తరలిస్తారు. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి యూఏఈ ఆస్ట్రోనాట్గా ఇప్పటికే రికార్డులకెక్కిన హజ్జా అల్ మన్సౌరి, అక్కడి నుంచి క్షేమంగా తిరిగొస్తున్న తొలి (తొలి ప్రయత్నంలోనే) యూఏఈ ఆస్ట్రోనాట్గానూ రికార్డ్ సృష్టించబోతున్నారు. ఆయనకి వెల్కమ్ చెప్పేందుకు యూఏఈతోపాటు, ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







