హజ్జా టీమ్ భూమికి తిరిగొచ్చేందుకు సిద్ధం
- October 03, 2019
మరికొద్ది గంటల్లోనే హజ్జా అల్ మన్సౌరి భూమికి తిరిగి రానున్నారు. యూఏఈకి చెందిన తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్మన్సౌరి, సోయుజ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన విషయం విదితమే. అక్కడే కొద్ది రోజులపాటు వివిధ ప్రయోగాలు చేపట్టిన హజ్జా అల్ మన్సౌరితోపాటు అమెరికా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెక్సీ ఓవుచినిన్ భూమికి తిరిగి రానున్నారు. యూఏఈ సమయం ప్రకారం ఉదయం 10.30 నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీరి వాహక నౌక అన్ డాక్ అవుతుంది. కజకిస్తాన్లో వీరి స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి వీరిని హెలికాప్టర్లో తరలిస్తారు. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి యూఏఈ ఆస్ట్రోనాట్గా ఇప్పటికే రికార్డులకెక్కిన హజ్జా అల్ మన్సౌరి, అక్కడి నుంచి క్షేమంగా తిరిగొస్తున్న తొలి (తొలి ప్రయత్నంలోనే) యూఏఈ ఆస్ట్రోనాట్గానూ రికార్డ్ సృష్టించబోతున్నారు. ఆయనకి వెల్కమ్ చెప్పేందుకు యూఏఈతోపాటు, ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







