విజయవాడ విమానాశ్రయం నుంచే మక్కా,మదీనాకు విమానాలు
- October 05, 2019
అమరావతి:రాష్ట్రం నుంచి మక్కా, మదీనా వెళ్లే హజ్ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే వీరు సౌదీ అరేబియాలోని పవిత్ర క్షేత్రాలకు వెళ్లి రావచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలోని ముస్లింలు హైదరాబాద్ వెళ్లి, అక్కడి నుంచి విమానాల్లో హజ్ యాత్రకు వెళుతున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి కూడా ఇందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిని గతంలో కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. స్థానిక విమానాశ్రయంలో అవసరమైన మౌలిక సదుపాయాలు లేనందున ఇద సాధ్యం కాదని అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు అన్ని మౌలిక వసతులు ఏర్పాటవడంతో వచ్చే ఏడాది నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 'ఇంటర్నేషనల్ హజ్ ఎంబార్కేషన్ చెక్ పాయింట్' హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ విమానాశ్రయ ఉన్నతాధికారులకు కేంద్ర మైనారిటీ మంత్రిత్వశాఖ నుంచి సమాచారం అందింది. దేశంలో ఇప్పటి వరకు 21 విమానాశ్రయాలకు మాత్రమే ఈ హోదా ఉంది. తాజాగా విజయవాడ ఎయిర్పోర్టు ఈ జాబితాలో చేరింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









