అమెరికాలో కూలిన యుద్ధవిమానం.. ఏడుగురి దుర్మరణం
- October 07, 2019
యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మరణించారు. అమెరికాలోని కనెక్టికట్ ప్రాంత బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి బీ-17 బాంబర్ విమానం బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తుండగా కుప్పకూలిపోయింది. ఈ యుద్ధ విమానం టేకాఫ్ అయిన పదినిమిషాలకే సాంకేతిక లోపం ఏర్పడటంతో అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు యత్నించారు. విమానం ల్యాండింగ్ చేస్తుండగా రన్ వేపై నియంత్రణ కోల్పోయి కుప్పకూలిపోయింది.
ఈ విమానంలో 13 మంది ఉండగా ఏడుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించామని ఎమర్జెన్సీ సర్వీసులు, ప్రజారక్షణశాఖ కమిషనర్ జేమ్స్ రోవెల్లా చెప్పారు. ఈ విమానం ల్యాండింగ్ చేస్తుండగా రన్ వేపై ఉన్న మరో వ్యక్తి గాయపడ్డారు. విమానం కూలిన రన్ వేపై మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడున్నర గంటలపాటు మూసివేశారు. యుద్ధ విమాన ప్రమాదంపై అమెరికా జాతీయ రవాణ భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







