సౌదీలో ఘోర రోడ్డుప్రమాదం...35 మంది మృతి, నలుగురికి గాయాలు
- October 17, 2019
సౌదీ: యాత్రికులతో వస్తున్న బస్సును ప్రొక్లెయినరు ఢీకొన్న ఘటనలో 35 మంది మరణించగా, నలుగురు గాయపడిన ఘటన సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో జరిగింది. మదీనా నగరంలోని అల్ అఖల్ కేంద్రం వద్ద బస్సు వస్తుండగా ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని అల్ హమ్నా ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సులో సౌదీ అరేబియాతోపాటు ఆసియా దేశాలకు చెందిన యాత్రికులున్నారని మదీనా పోలీసులు చెప్పారు. గాయపడిన నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరైనా భారతదేశ వాసులెవరైనా ఉన్నారా అనే విషయంపై భారత రాయబార కార్యాలయం అధికారులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







