సౌదీలో ఘోర రోడ్డుప్రమాదం...35 మంది మృతి, నలుగురికి గాయాలు
- October 17, 2019సౌదీ: యాత్రికులతో వస్తున్న బస్సును ప్రొక్లెయినరు ఢీకొన్న ఘటనలో 35 మంది మరణించగా, నలుగురు గాయపడిన ఘటన సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో జరిగింది. మదీనా నగరంలోని అల్ అఖల్ కేంద్రం వద్ద బస్సు వస్తుండగా ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని అల్ హమ్నా ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సులో సౌదీ అరేబియాతోపాటు ఆసియా దేశాలకు చెందిన యాత్రికులున్నారని మదీనా పోలీసులు చెప్పారు. గాయపడిన నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరైనా భారతదేశ వాసులెవరైనా ఉన్నారా అనే విషయంపై భారత రాయబార కార్యాలయం అధికారులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక