సౌదీలో ఘోర రోడ్డుప్రమాదం...35 మంది మృతి, నలుగురికి గాయాలు

- October 17, 2019 , by Maagulf
సౌదీలో ఘోర రోడ్డుప్రమాదం...35 మంది మృతి, నలుగురికి గాయాలు

సౌదీ: యాత్రికులతో వస్తున్న బస్సును ప్రొక్లెయినరు ఢీకొన్న ఘటనలో 35 మంది మరణించగా, నలుగురు గాయపడిన ఘటన సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో జరిగింది. మదీనా నగరంలోని అల్ అఖల్ కేంద్రం వద్ద బస్సు వస్తుండగా ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని అల్ హమ్నా ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సులో సౌదీ అరేబియాతోపాటు ఆసియా దేశాలకు చెందిన యాత్రికులున్నారని మదీనా పోలీసులు చెప్పారు. గాయపడిన నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరైనా భారతదేశ వాసులెవరైనా ఉన్నారా అనే విషయంపై భారత రాయబార కార్యాలయం అధికారులు ఆరా తీస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com