'నేత్ర' మూవీ ఫస్ట్లుక్ ఆవిష్కరించిన హీరో నరేష్
- October 16, 2019
బివిఎస్ఆర్ క్రియేషన్స్, మీజా ఎంటర్టైన్మెంట్స్ బేనర్స్పై బి.వి సుబ్బారెడ్డి నిర్మాతగా హుస్సేన్(ఎ.ఎండి) దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'నేత్ర'. లతా సంగరాజు, గీతా సింగ్, బద్రం, కేదార్శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్కి సిద్ధంగా ఉంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ను 'మా' అధ్యక్షుడు డా. నరేష్, నటుడు శివబాలాజీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హుస్సేన్ (ఎ.ఎండి) మాట్లాడుతూ... ''మా చిత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేసిన నరేష్గారికి, శివబాలాజీగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 'నేత్ర' ఒక సస్పెన్స్ థ్రిల్లర్. టైటిల్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. లతా సంగరాజు, గీతా సింగ్, బద్రం ఇలా ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్లో చాలా బాగా నటించారు. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది.
రఘునాథన్ సినిమాటోగ్రఫి, రాజ్కిరణ్ మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్ అయ్యాయి. మా నిర్మాత సుబ్బారెడ్డిగారు సినిమాపై ఎంతో ఫ్యాషన్తో మాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాం. త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం'' అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







