నిలిచిపోయిన ఏపీ బస్సు సర్వీసులు
- October 19, 2019
విజయవాడ : తెలంగాణ బంద్ నేపధ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. హైదరాబాద్, భద్రాచలం వైపు బస్సులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి తెలంగాణాకు వెళ్లే అన్ని బస్సులు ఆపేశామని డీసీటీఎం మూర్తి తెలిపారు. బంద్ వల్ల ప్రయాణికులు సంఖ్య కూడా బాగా తగ్గిందన్నారు. తెలంగాణ లో పరిస్థితి ఉద్రిక్తతంగా ఉండటం వల్ల ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సర్వీసులు రద్దు చేశామన్నారు. వీకెండ్ కావడంతో సంస్థకు కూడా నష్టం జరిగిందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం మరోసారి తమ ఉన్నతాధికారులు సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







