విజయ్ సేతుపతి నిర్ణయాన్ని మెచ్చుకున్న గ్రామ ప్రజలు
- October 20, 2019విజయ్ సేతుపతి రైతుల కోసం ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. విజయ్.తాజాగా 'లాభం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రజలకు మంచి మెసేజ్ స్టోరీలు తెరకెక్కించే సీనియర్ డైరెక్టర్ ఎస్.ఫై.జననాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ సందర్భంగా ఈ సినిమాలో రైతులకు సంబంధించిన భవనం అవసరమైంది. దీంతో చిత్ర యూనిట్ ఓ సెట్ వేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే అలాంటి సెట్ ఏం వద్దని నిజమైన రైతులు ఉండే ఊరులోనే చిత్రీకరణ జరుపుదామని విజయ్ సేతుపతి చెప్పారు. అలాగే అక్కడ రైతు సంఘం కోసం ఒక భవనం నిర్మించి అందులో షూటింగ్ చేద్దామని చిత్రయునిట్ కు చెప్పారు. ఇక షూటింగ్ పూర్తయ్యాక ఆ ఊరి ప్రజలకే భవనాన్ని అప్పగించాలని కోరారట. ఈ నిర్ణయంపై చిత్ర యూనిట్ విజయ్ సేతుపతిని అభినందించింది. అలాగే గ్రామ ప్రజలు కూడా కూడా హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ