విజయ్ సేతుపతి నిర్ణయాన్ని మెచ్చుకున్న గ్రామ ప్రజలు
- October 20, 2019
విజయ్ సేతుపతి రైతుల కోసం ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. విజయ్.తాజాగా 'లాభం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రజలకు మంచి మెసేజ్ స్టోరీలు తెరకెక్కించే సీనియర్ డైరెక్టర్ ఎస్.ఫై.జననాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ సందర్భంగా ఈ సినిమాలో రైతులకు సంబంధించిన భవనం అవసరమైంది. దీంతో చిత్ర యూనిట్ ఓ సెట్ వేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే అలాంటి సెట్ ఏం వద్దని నిజమైన రైతులు ఉండే ఊరులోనే చిత్రీకరణ జరుపుదామని విజయ్ సేతుపతి చెప్పారు. అలాగే అక్కడ రైతు సంఘం కోసం ఒక భవనం నిర్మించి అందులో షూటింగ్ చేద్దామని చిత్రయునిట్ కు చెప్పారు. ఇక షూటింగ్ పూర్తయ్యాక ఆ ఊరి ప్రజలకే భవనాన్ని అప్పగించాలని కోరారట. ఈ నిర్ణయంపై చిత్ర యూనిట్ విజయ్ సేతుపతిని అభినందించింది. అలాగే గ్రామ ప్రజలు కూడా కూడా హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







