'పింక్' పవన్ కల్యాణ్

- November 03, 2019 , by Maagulf
'పింక్' పవన్ కల్యాణ్

సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారని, హిందీలో విజయవంతమైన 'పింక్‌' రీమేక్‌లో నటించబోతున్నారని ఈనాడు వెల్లడించింది. ఆ విషయాన్ని బాలీవుడ్‌ వర్గాలు ధ్రువీకరించాయని పేర్కొంది. బాలీవుడ్‌లో నిర్మితమైన 'పింక్‌'లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించగా అనిరుద్ధరాయ్‌ చౌధురి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్‌ కథానాయకుడిగా బోనీ కపూర్‌ పునర్నిర్మించారు. ఇప్పుడు తెలుగులో దిల్‌రాజుతో కలిసి బోనీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని, యువ దర్శకుడు శ్రీరామ్‌ వేణు తెరకెక్కిస్తారని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

ఆ ట్వీట్‌ని నిర్మాత బోనీ రీట్వీట్‌ చేయడంతో అది నిజమే అని ధ్రువీకరించినట్టైంది. హిందీ, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్ర కథ నచ్చి పవన్‌ అంగీకారం తెలిపారని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com