'పింక్' పవన్ కల్యాణ్
- November 03, 2019
సినీనటుడు పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారని, హిందీలో విజయవంతమైన 'పింక్' రీమేక్లో నటించబోతున్నారని ఈనాడు వెల్లడించింది. ఆ విషయాన్ని బాలీవుడ్ వర్గాలు ధ్రువీకరించాయని పేర్కొంది. బాలీవుడ్లో నిర్మితమైన 'పింక్'లో అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించగా అనిరుద్ధరాయ్ చౌధురి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్ కథానాయకుడిగా బోనీ కపూర్ పునర్నిర్మించారు. ఇప్పుడు తెలుగులో దిల్రాజుతో కలిసి బోనీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని, యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తారని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్లో వెల్లడించారు.
ఆ ట్వీట్ని నిర్మాత బోనీ రీట్వీట్ చేయడంతో అది నిజమే అని ధ్రువీకరించినట్టైంది. హిందీ, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్ర కథ నచ్చి పవన్ అంగీకారం తెలిపారని సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







