'పింక్' పవన్ కల్యాణ్
- November 03, 2019
సినీనటుడు పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారని, హిందీలో విజయవంతమైన 'పింక్' రీమేక్లో నటించబోతున్నారని ఈనాడు వెల్లడించింది. ఆ విషయాన్ని బాలీవుడ్ వర్గాలు ధ్రువీకరించాయని పేర్కొంది. బాలీవుడ్లో నిర్మితమైన 'పింక్'లో అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించగా అనిరుద్ధరాయ్ చౌధురి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తమిళంలో అజిత్ కథానాయకుడిగా బోనీ కపూర్ పునర్నిర్మించారు. ఇప్పుడు తెలుగులో దిల్రాజుతో కలిసి బోనీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని, యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తారని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్లో వెల్లడించారు.
ఆ ట్వీట్ని నిర్మాత బోనీ రీట్వీట్ చేయడంతో అది నిజమే అని ధ్రువీకరించినట్టైంది. హిందీ, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్ర కథ నచ్చి పవన్ అంగీకారం తెలిపారని సమాచారం.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









