నాగార్జున మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి
- January 12, 2016
పైరసీని అరికట్టాల్సిందిగా సినీ నటుడు నాగార్జున మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం ద్వారా కేవలం తనకు మాత్రమే కాకుండా మొత్తం సినీ పరిశ్రమకు మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. మంగళవారం సాక్షి టీవీ చానెల్ లో ది ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఇదే సమయంలో ప్రముఖ నటుడు నాగార్జున లైవ్ ద్వారా కేటీఆర్ తో మాట్లాడారు.ముందుగా కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున అనంతరం సినిమా వర్గం తరుపున ఒక విజ్ఞప్తి చేశారు. తెలుగు సినిమా రంగాన్ని పైరసీ పట్టి పీడిస్తోందని, దానిని అరికడితే అటూ సినీ పరిశ్రమకు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందని గుర్తు చేశారు.ఈ విజ్ఞప్తిని సావధానంగా విన్న కేటీఆర్ చిరునవ్వులు పూయిస్తూ అందుకు సరేనన్నారు. తాను నాగార్జునకు గొప్ప ఫ్యాన్ అని, శివ సినిమా అప్పటి నుంచే అభిమానిగా మారిపోయానని చెప్పారు. పైరసీని అరికట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









