నాగార్జున మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి
- January 12, 2016
పైరసీని అరికట్టాల్సిందిగా సినీ నటుడు నాగార్జున మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం ద్వారా కేవలం తనకు మాత్రమే కాకుండా మొత్తం సినీ పరిశ్రమకు మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. మంగళవారం సాక్షి టీవీ చానెల్ లో ది ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఇదే సమయంలో ప్రముఖ నటుడు నాగార్జున లైవ్ ద్వారా కేటీఆర్ తో మాట్లాడారు.ముందుగా కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున అనంతరం సినిమా వర్గం తరుపున ఒక విజ్ఞప్తి చేశారు. తెలుగు సినిమా రంగాన్ని పైరసీ పట్టి పీడిస్తోందని, దానిని అరికడితే అటూ సినీ పరిశ్రమకు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందని గుర్తు చేశారు.ఈ విజ్ఞప్తిని సావధానంగా విన్న కేటీఆర్ చిరునవ్వులు పూయిస్తూ అందుకు సరేనన్నారు. తాను నాగార్జునకు గొప్ప ఫ్యాన్ అని, శివ సినిమా అప్పటి నుంచే అభిమానిగా మారిపోయానని చెప్పారు. పైరసీని అరికట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







