బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్, రజనీ
- November 08, 2019
కమల్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ కోసం చెన్నైలో కొత్త కార్యాలయం నిర్మించుకున్నారు. ఆ కార్యాలయ ప్రారంభోత్సవానికి రజనీకాంత్ సహా అనేకమంది చిత్రప్రముఖులను ఆహ్వానించారు. ఆ కార్యాలయంలోనే బాలచందర్ విగ్రహం ఏర్పాటు చేయించిన కమల్, ఆ విగ్రహాన్ని రజనీకాంత్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజనీకాంత్, కమల్ హాసన్ ఒకరిపై ఒకరు అభినందనల జల్లు కురిపించుకున్నారు. కమల్ రాజకీయాల్లో ప్రవేశించినా సినిమా రంగాన్ని మాత్రం మర్చిపోలేదని, కళను ఎల్లప్పుడూ అనుసరిస్తూనే ఉన్నారని రజనీ కొనియాడారు. కమల్ మాట్లాడుతూ, రజనీ, తాను ఒకరినొకరు గౌరవించుకుంటామని, విమర్శించుకుంటామని, ఒకరి పనిని మరొకరం ఇష్టపడుతూనే ఉంటామని వివరించారు. ఇరువురి భవిష్యత్ శుభప్రదంగానే ఉంటుందని తమకు గట్టి నమ్మకం అని తెలిపారు. కాగా జాతీయ స్థాయిలో తమదైన ముద్రవేసిన రజనీకాంత్, కమల్ హాసన్ కూడా బాలచందర్ శిష్యులే. ఇప్పుడు వారిద్దరూ తమ గురువైన బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ధన్యులయ్యారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







