పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్
- November 08, 2019
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మంత్రుల బృందం రాజ్భవన్లో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీని కలిసింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్న లేఖను ఈ సందర్భంగా గవర్నర్కు ఫడణవీస్ అందించారు. నా రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ఫడణవీస్ వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అవకాశమివ్వాలని గవర్నర్ను బీజేపీ కొరలేదని తెలిసింది. మరోవైపు సీఎం పదవిని తమ పార్టీ నేత చేపట్టబోతున్నారని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









