ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు దాటిన గండం
- November 13, 2019
హాంకాంగ్: ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు చాన్నాళ్ల తర్వాత తొలిరౌండ్ గండాన్ని దాటింది. హాంకాంగ్ ఓపెన్లో రెండో రౌండ్కు చేరుకుంది. ప్రపంచ 19వ ర్యాంకర్ కిమ్ గా ఉన్ (ద.కొరియా)పై 21-15, 21-16తో వరుస గేముల్లో విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లో ఆటను ముగించింది. తర్వాతి రౌండ్లో థాయ్ల్యాండ్ అమ్మాయి బుసానన్తో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ పరాజయం పాలయ్యాడు. 54 నిమిషాలు పోరాడి 11-21, 21-13, 8-21 తేడాతో ఓడాడు. అంతకు ముందు సైనా నెహ్వాల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
రెండు గేముల్లోనూ సింధు ఆధిపత్యం చెలాయించింది. మొదట 8-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పుంజుకున్న కిమ్ స్వల్ప విరామానికి ముందు 11-10తో సింధును వెనక్కినెట్టింది. 13-13తో స్కోర్లు సమమైన స్థితిలో భారత షట్లర్ విజృంభించి వరుసగా 6 పాయింట్లతో గేమ్ గెలిచింది. రెండో గేమ్ సైతం 5-5తో సమమైనప్పుడు సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా 7 పాయింట్లు సాధించి 12-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో గేమ్తో పాటు మ్యాచ్ను కూడా గెలిచింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!