ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు దాటిన గండం

- November 13, 2019 , by Maagulf
ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు దాటిన గండం

హాంకాంగ్‌: ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు చాన్నాళ్ల తర్వాత తొలిరౌండ్ గండాన్ని దాటింది. హాంకాంగ్‌ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. ప్రపంచ 19వ ర్యాంకర్‌ కిమ్‌ గా ఉన్‌ (ద.కొరియా)పై 21-15, 21-16తో వరుస గేముల్లో విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లో ఆటను ముగించింది. తర్వాతి రౌండ్లో థాయ్‌ల్యాండ్‌ అమ్మాయి బుసానన్‌తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ పరాజయం పాలయ్యాడు. 54 నిమిషాలు పోరాడి 11-21, 21-13, 8-21 తేడాతో ఓడాడు. అంతకు ముందు సైనా నెహ్వాల్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

రెండు గేముల్లోనూ సింధు ఆధిపత్యం చెలాయించింది. మొదట 8-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పుంజుకున్న కిమ్‌ స్వల్ప విరామానికి ముందు 11-10తో సింధును వెనక్కినెట్టింది. 13-13తో స్కోర్లు సమమైన స్థితిలో భారత షట్లర్‌ విజృంభించి వరుసగా 6 పాయింట్లతో గేమ్‌ గెలిచింది. రెండో గేమ్‌ సైతం 5-5తో సమమైనప్పుడు సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా 7 పాయింట్లు సాధించి 12-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com