ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు దాటిన గండం
- November 13, 2019
హాంకాంగ్: ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు చాన్నాళ్ల తర్వాత తొలిరౌండ్ గండాన్ని దాటింది. హాంకాంగ్ ఓపెన్లో రెండో రౌండ్కు చేరుకుంది. ప్రపంచ 19వ ర్యాంకర్ కిమ్ గా ఉన్ (ద.కొరియా)పై 21-15, 21-16తో వరుస గేముల్లో విజయం సాధించింది. కేవలం 36 నిమిషాల్లో ఆటను ముగించింది. తర్వాతి రౌండ్లో థాయ్ల్యాండ్ అమ్మాయి బుసానన్తో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ పరాజయం పాలయ్యాడు. 54 నిమిషాలు పోరాడి 11-21, 21-13, 8-21 తేడాతో ఓడాడు. అంతకు ముందు సైనా నెహ్వాల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
రెండు గేముల్లోనూ సింధు ఆధిపత్యం చెలాయించింది. మొదట 8-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పుంజుకున్న కిమ్ స్వల్ప విరామానికి ముందు 11-10తో సింధును వెనక్కినెట్టింది. 13-13తో స్కోర్లు సమమైన స్థితిలో భారత షట్లర్ విజృంభించి వరుసగా 6 పాయింట్లతో గేమ్ గెలిచింది. రెండో గేమ్ సైతం 5-5తో సమమైనప్పుడు సింధు ఒక్కసారిగా చెలరేగి వరుసగా 7 పాయింట్లు సాధించి 12-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో గేమ్తో పాటు మ్యాచ్ను కూడా గెలిచింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







