'కోడీశ్వరి' క్విజ్ షోకు రాధిక హోస్ట్
- November 13, 2019
కౌన్ బనేగా కరోడ్పతి.. ఈ షో గుర్తింది కదా..! బాలీవుడ్లో.. అమితాబ్ హోస్ట్గా వ్యవహరించిన ఈ షో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ రేటింగ్తో దూసుకెళ్లింది. ఇది బాగా పాపులర్ అవడంతో.. అనంతరం ఈ షోను వివిధ భాషల్లోనూ తీసుకొచ్చారు. తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఈ షోకి వ్యాఖ్యతలుగా వ్యవహరించగా.. తమిళంలో 'నీంగలుమ్ వెల్లాలుమ్' ఒరు కోడి' పేరుతో.. సూర్య, ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామిలు ఒక్కో సీజన్లో హోస్టులుగా వ్యవహరించారు.
కాగా.. ఇప్పుడు ఈ షోకు.. సినీనటి రాధికకు లింక్ ఏంటని అనుకుంటున్నారా..? అసమాన నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఈషోకు హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. కోటీశ్వరుడు మాదిరిగా.. తమిళంలో 'కోడీశ్వరి' అనే గేమ్ షోను ప్లాన్ చేశారు. ఈ క్విజ్ షోకు రాధిక హోస్ట్గా వ్యవహరిస్తుండగా.. ఇందులో కేవలం మహిళలు మాత్రమే పార్టిసిపేట్ చేయనున్నారు. పలు టీవీ సీరియల్స్లో నటించిన రాధికా తొలిసారి హోస్ట్గా దర్శనమివ్వనున్నారు. కలర్స్లో టీవీ ఛానెల్లో ఈ షో ప్రసారం కానుంది. డిసెంబర్లో ఈ షో ప్రారంభం కానున్నట్టు సమాచారం. అయితే.. ఈ షో టైమింగ్స్ ఇంకా డిసైడ్ చేయలేదు.
ఈ సందర్భంగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. రాధికకు ఓ వీడియో రికార్డ్ చేసి పంపారు. ఆ వీడియోలో.. మొదటిసారిగా.. ఈ షోకు ఓ లెడీ సూపర్ స్టార్ హోస్ట్గా వ్యవహరించడం.. కేబీసీ చరిత్రలో సువర్ణ అధ్యాయం.. అందులోనూ.. ఓన్లీ ఫీమేల్స్ కోసమే ఈ షో ఉండటం గమనించదగ్గ విషయం. మీ కెరీర్లో ఎంత ఉన్నత స్థానం సంపాదించారో.. ఇందులో కూడా మంచి పేరు సాధించాలని కోరుకుంటూ.. రాధికకు ఆల్దిబెస్ట్ చెప్పారు అమితాబ్.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







