'కోడీశ్వరి' క్విజ్ షోకు రాధిక హోస్ట్
- November 13, 2019
కౌన్ బనేగా కరోడ్పతి.. ఈ షో గుర్తింది కదా..! బాలీవుడ్లో.. అమితాబ్ హోస్ట్గా వ్యవహరించిన ఈ షో.. ఇండియాలోనే బిగ్గెస్ట్ రేటింగ్తో దూసుకెళ్లింది. ఇది బాగా పాపులర్ అవడంతో.. అనంతరం ఈ షోను వివిధ భాషల్లోనూ తీసుకొచ్చారు. తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఈ షోకి వ్యాఖ్యతలుగా వ్యవహరించగా.. తమిళంలో 'నీంగలుమ్ వెల్లాలుమ్' ఒరు కోడి' పేరుతో.. సూర్య, ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామిలు ఒక్కో సీజన్లో హోస్టులుగా వ్యవహరించారు.
కాగా.. ఇప్పుడు ఈ షోకు.. సినీనటి రాధికకు లింక్ ఏంటని అనుకుంటున్నారా..? అసమాన నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఈషోకు హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. కోటీశ్వరుడు మాదిరిగా.. తమిళంలో 'కోడీశ్వరి' అనే గేమ్ షోను ప్లాన్ చేశారు. ఈ క్విజ్ షోకు రాధిక హోస్ట్గా వ్యవహరిస్తుండగా.. ఇందులో కేవలం మహిళలు మాత్రమే పార్టిసిపేట్ చేయనున్నారు. పలు టీవీ సీరియల్స్లో నటించిన రాధికా తొలిసారి హోస్ట్గా దర్శనమివ్వనున్నారు. కలర్స్లో టీవీ ఛానెల్లో ఈ షో ప్రసారం కానుంది. డిసెంబర్లో ఈ షో ప్రారంభం కానున్నట్టు సమాచారం. అయితే.. ఈ షో టైమింగ్స్ ఇంకా డిసైడ్ చేయలేదు.
ఈ సందర్భంగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. రాధికకు ఓ వీడియో రికార్డ్ చేసి పంపారు. ఆ వీడియోలో.. మొదటిసారిగా.. ఈ షోకు ఓ లెడీ సూపర్ స్టార్ హోస్ట్గా వ్యవహరించడం.. కేబీసీ చరిత్రలో సువర్ణ అధ్యాయం.. అందులోనూ.. ఓన్లీ ఫీమేల్స్ కోసమే ఈ షో ఉండటం గమనించదగ్గ విషయం. మీ కెరీర్లో ఎంత ఉన్నత స్థానం సంపాదించారో.. ఇందులో కూడా మంచి పేరు సాధించాలని కోరుకుంటూ.. రాధికకు ఆల్దిబెస్ట్ చెప్పారు అమితాబ్.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







