ఏఎన్ఆర్ అవార్డ్స్.. గెస్ట్గా మెగాస్టార్
- November 14, 2019
అక్కినేని ఫ్యామిలీ ప్రతి ఏడాది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం ఒక్కో సెలబ్రిటీని ఈ అవార్డ్కి ఎంపిక చేస్తూ వస్తున్నారు. అయితే 2017లో రాజమౌళికి ఏఎన్ఆర్ అవార్డ్ దక్కగా, తాజాగా 2018, 2019 సంవత్సరాలకి గాను అవార్డుల జాబితా ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను శ్రీదేవిని, 2019 సంవత్సరానికి గాను రేఖ.. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ అందుకోనున్నట్టు నాగార్జున ప్రకటించారు. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుల కార్యక్రమం నవంబర్ 17న జరగనుండగా, ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నట్టు నాగ్ తెలిపారు. ఇక తన సినిమా డిసెంబర్లో ప్రారంభం కానుందని నాగ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







