ఏఎన్ఆర్ అవార్డ్స్.. గెస్ట్గా మెగాస్టార్
- November 14, 2019
అక్కినేని ఫ్యామిలీ ప్రతి ఏడాది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం ఒక్కో సెలబ్రిటీని ఈ అవార్డ్కి ఎంపిక చేస్తూ వస్తున్నారు. అయితే 2017లో రాజమౌళికి ఏఎన్ఆర్ అవార్డ్ దక్కగా, తాజాగా 2018, 2019 సంవత్సరాలకి గాను అవార్డుల జాబితా ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను శ్రీదేవిని, 2019 సంవత్సరానికి గాను రేఖ.. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ అందుకోనున్నట్టు నాగార్జున ప్రకటించారు. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుల కార్యక్రమం నవంబర్ 17న జరగనుండగా, ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నట్టు నాగ్ తెలిపారు. ఇక తన సినిమా డిసెంబర్లో ప్రారంభం కానుందని నాగ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







