కమలహాసన్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
- November 19, 2019
ఒడిశా: ప్రముఖ సినీనటుడు కమలహాసన్ కు ఒడిశాలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చేతుల మీదుగా కమల్ ఈ రోజు ఈ డాక్టరేట్ అందుకున్నారు. బాల్యంలోనే నట జీవితాన్ని ప్రారంభించిన కమలహాసన్ ఇటీవల సినీ జీవితంలో 60 వసంతాలను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తన నటనకు గానూ ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. కమల్ విశిష్ట నటుడిగా మాత్రమే కాకుండా.. మంచి కథకుడిగా, స్కీన్ర్ ప్లే రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగానూ రాణించారు. 1980, 90ల్లో వచ్చిన కమల్ సినిమాలు ఆయనలోని అసాధారణ నటనను బయటపెట్టాయి. ఇప్పటికీ ఆయన విభిన్న పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. గతంలో చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం కూడా కమల్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









