పెరుగుతున్న చలి: షిరిడీకి విమానాలు రద్దు
- November 20, 2019
తెలంగాణలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదుడిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీనికితోడు ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో 13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, థాంసీ, కొమరం భీం సిర్పూరులో 13.7డిగ్రీల చొప్పున నమోదైంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక గాలిలో తేమ శాతం తగ్గుముఖం పట్టడంతో గ్రేటర్ హైదరాబాద్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.
మరోవైపు..తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని వున్న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా ఉరుములు , మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి. పలుచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయి.
ఇదిలా ఉంటే..ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి షిరిడీకి వెళ్లే పలు విమానాలు రద్దయ్యాయి. స్పైస్జెట్ విమానాలతోపాటు ఇండిగో, ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నిన్న వెళ్లాల్సిన ఆయా విమానాలను నేటికి రీ షెడ్యూల్ చేసినట్లు ఎయిర్లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణాలు రద్దవడంతో ప్రయాణికులకు ఆయా సంస్థలు విమాన చార్జీలు తిరిగి చెల్లిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







