పెరుగుతున్న చలి: షిరిడీకి విమానాలు రద్దు
- November 20, 2019
తెలంగాణలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదుడిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీనికితోడు ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో 13.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, థాంసీ, కొమరం భీం సిర్పూరులో 13.7డిగ్రీల చొప్పున నమోదైంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక గాలిలో తేమ శాతం తగ్గుముఖం పట్టడంతో గ్రేటర్ హైదరాబాద్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.
మరోవైపు..తూర్పు మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని వున్న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా ఉరుములు , మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి. పలుచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయి.
ఇదిలా ఉంటే..ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి షిరిడీకి వెళ్లే పలు విమానాలు రద్దయ్యాయి. స్పైస్జెట్ విమానాలతోపాటు ఇండిగో, ఎయిర్ ఇండియాకు సంబంధించిన విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నిన్న వెళ్లాల్సిన ఆయా విమానాలను నేటికి రీ షెడ్యూల్ చేసినట్లు ఎయిర్లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణాలు రద్దవడంతో ప్రయాణికులకు ఆయా సంస్థలు విమాన చార్జీలు తిరిగి చెల్లిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!









