కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- November 10, 2025
కువైట్: కువైట్ లో సేవ మరియు భద్రతా వ్యవస్థలను మెరుగుపరచడం లక్ష్యంగా సంస్కరణలు కొనసాగుతున్నాయని మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ అల్-సబా వెల్లడించారు. గ్రాండ్ హయత్ హోటల్లో జరిగిన ఇనిషియేటివ్స్ ఫోరమ్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పౌరులు, నివాసితులు మరియు సందర్శకులు ఈ సంస్కరణల సానుకూల ఫలితాలను త్వరలో అనుభవిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంట్రీ వీసాలను జారీ చేయడంలో కువైట్ సామర్థ్యాన్ని షేక్ ఫహాద్ హైలైట్ చేశారు. ఈ ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదని, ఐదు నిమిషాల్లోనే ఆమోదం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రాంతీయ భద్రతా సహకారంపై స్పందిస్తూ.. గల్ఫ్ సహకార మండలి (GCC) సభ్య దేశాల అంతర్గత మంత్రిత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం ఉందని షేక్ ఫహాద్ చెప్పారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో ఉమ్మడి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. కువైట్ దాని సముద్ర మరియు భూ సరిహద్దులను కవర్ చేసేలా అధునాతన రాడార్ వ్యవస్థను కలిగి ఉందని షేక్ ఫహాద్ తెలియజేశారు. ఇది దేశంలోకి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు ప్రవేశించకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







