ఐటీ వలలో టాలీవుడ్
- November 20, 2019టాలీవుడ్కు చెందిన బడా బడా వ్యక్తులు టార్గెట్గా ఐటీ పంజా విసిరింది. ఈ రోజు ఉదయం ముందుగా అగ్ర నిర్మాత సురేష్బాబును టార్గెట్ చేసిన ఐటీ రామానాయుడు స్టూడియోతో పాటు, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో కంటిన్యూగా సోదాలు చేస్తోంది. ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. ఆ వెంటనే ఐటీ అధికారులు నేచురల్ స్టార్ నానిని కూడా టార్గెట్ చేశారు. నాని ఇంటితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ ఏకకాలంలో దాడులు కొనసాగిస్తున్నారు.
కొద్ది రోజులుగా టాలీవుడ్లో పలువురు స్టార్ నిర్మాతలు, బడా ప్రొడ్యుసర్లు టార్గెట్గా వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు ఒకేసారి అటు నిర్మాత సురేష్బాబుతో పాటు హీరో నాని ఇళ్లపై దాడులు చేయడంతో టాలీవుడ్ అంతా ఉలిక్కి పడుతోంది. ఇక మరో స్టార్ హీరో మహేష్బాబుతో పాటు యంగ్ హీరో శర్వానంద్ ఇళ్లపై సైతం ఐటీ దాడులు జరుగుతాయని కూడా తెలుస్తోంది.
ఇక కేటీఆర్కు సన్నిహితంగా ఉంటోన్న మరో సీనియర్ హీరో నాగార్జున ఇంటితో పాటు అన్నపూర్ణ స్టూడియోస్పై సైతం ఐటీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. గత నెల రోజుల నుంచి ఐటీ పంజా టాలీవుడ్పై పడుతోంది. కేఎల్.నారాయణతో పాటు ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్, సునీల్ నారంగ్ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం