'తలైవీ' ఫస్ట్ లుక్ విడుదల...
- November 23, 2019
ఈ మద్య వరుసగా బయోపిక్ మూవీస్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) తెలుగు, హిందీ భాషల్లో రాజకీయ,సినీ, క్రీడా నేపథ్యంలోనే కాదు ప్రముఖల జీవితాలపై కూడా ఎన్నో బయోపిక్ లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ను 'తలైవి' పేరుతో తెలుగు నిర్మాత విష్ణు ఇందూరి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది.
అరవిందస్వామి ఇందులో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరో లెజెండ్రీ పొలిటీషియన్, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పాత్రలో ఆ మద్య జూనియర్ ఎన్టీఆర్ ని అనుకున్నప్పటికీ ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్ 'మూవీ బిజీలో ఉంటం వల్ల తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా జయలలితగా నటిస్తోన్న కంగనా రనౌత్కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ను విడుదల చేశారు. కటౌట్లో ఉన్న కంగనాను చూస్తుంటే అచ్చు అమ్మని చూసినట్టే ఉందంటున్నారు తమిళ ప్రజలు. కంగనా జయలలితగా బాగా మేకోవర్ అయ్యారు.
సినిమాను 2020 జూన్ 26న విడుదల చేయనున్నారు.'బ్లేడ్ రన్నర్', 'కెప్టెన్ మార్వెల్' వంటి హాలీవుడ్ మూవీస్ లో వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ కంగనా రనౌత్ను ప్రత్యేక మేకప్తో జయలలితగా చూపిస్తున్నారు. మొత్తానికి ఈ మూవీతో దేశ వ్యాప్తంగా మరో సంచలనం సృష్టించబోతున్నట్లు అర్థం అవుతుంది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







