మస్కట్:పర్యాటక ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమాన
- November 30, 2019మస్కట్:పర్యాటక ప్రదేశాల పరిశుభ్రత కోసం మస్కట్ మున్సిపాలిటీ కఠిన చర్యలు తీసుకుంటోంది. బహిరంగప్రదేశాలు, పర్యాటక ప్రాంతాల్లో చెత్త, ఇతర వ్యర్థాలను వేయటంపై నిషేధం విధించింది. కేవలం నిర్దేశించిన ప్రాంతాల్లోనే చెత్తను వేయాలని సూచించింది. 49వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా గత బుధవారం నుంచి శనివారం వరకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేసింది.
మస్కట్ మున్సిపాలిటీ నిషేదాజ్ఞలను ఉల్లంఘిస్తూ చెత్త, వ్యర్ధాలను బహిరంగ, పర్యాటక ప్రాంతాల్లో వేస్తే OMR 100 జరిమాన విధించనున్నారు. ఒకసారి జరిమాన చెల్లించినా మళ్లీ రెండోసారి కూడా చెత్త వేస్తే ఫైన్ రెండింతలు అవుతుందని మున్సిపాలిటి అధికారులు హెచ్చరించారు.
పబ్లిక్ ప్రాంతాలు, పార్కులు, గార్డెన్లలో చెత్త వేయకూడదని ఈ ఏడాది మొదట్లోనే మస్కట్ మున్సిపాలిటి నిబంధనలను ప్రకటించింది. అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా గత జనవరి నుంచి నిబంధనలను అమలు చేస్తున్నారు. పబ్లిక్ ప్రాంతల్లో నిబంధనలు పాటించని వారు జరిమానతో పాటు వేసిన చెత్తను తొలగించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ