మస్కట్:పర్యాటక ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమాన
- November 30, 2019
మస్కట్:పర్యాటక ప్రదేశాల పరిశుభ్రత కోసం మస్కట్ మున్సిపాలిటీ కఠిన చర్యలు తీసుకుంటోంది. బహిరంగప్రదేశాలు, పర్యాటక ప్రాంతాల్లో చెత్త, ఇతర వ్యర్థాలను వేయటంపై నిషేధం విధించింది. కేవలం నిర్దేశించిన ప్రాంతాల్లోనే చెత్తను వేయాలని సూచించింది. 49వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా గత బుధవారం నుంచి శనివారం వరకు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేసింది.
మస్కట్ మున్సిపాలిటీ నిషేదాజ్ఞలను ఉల్లంఘిస్తూ చెత్త, వ్యర్ధాలను బహిరంగ, పర్యాటక ప్రాంతాల్లో వేస్తే OMR 100 జరిమాన విధించనున్నారు. ఒకసారి జరిమాన చెల్లించినా మళ్లీ రెండోసారి కూడా చెత్త వేస్తే ఫైన్ రెండింతలు అవుతుందని మున్సిపాలిటి అధికారులు హెచ్చరించారు.
పబ్లిక్ ప్రాంతాలు, పార్కులు, గార్డెన్లలో చెత్త వేయకూడదని ఈ ఏడాది మొదట్లోనే మస్కట్ మున్సిపాలిటి నిబంధనలను ప్రకటించింది. అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా గత జనవరి నుంచి నిబంధనలను అమలు చేస్తున్నారు. పబ్లిక్ ప్రాంతల్లో నిబంధనలు పాటించని వారు జరిమానతో పాటు వేసిన చెత్తను తొలగించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









