ఓ మై కడవులే తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న పివిపి సినిమా
- February 08, 2020
బలుపు, క్షణం, ఘాజీ, రాజుగారిగది 2,మహర్షి వంటి స్ట్రయిట్ సినిమాలతో పాటు ఎవరు, ఊపిరి వంటి రీమేక్ చిత్రాలతోనూ నిర్మాతగా సూపర్హిట్స్ అందుకున్నారు పివిపి సినిమా అధినేత ప్రసాద్ వి.పొట్లూరి. నిర్మాణ సంస్థగా భారీ బడ్జెట్ చిత్రాలనే కాదు.. రీమేక్ చిత్రాలను కూడా అందిస్తున్న పివిపి సినిమా ఇప్పుడు తమిళ చిత్రం ఓ మై కడవులే సినిమా రీమేక్ హక్కులను దక్కించుకుంది.
తమిళంలో అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణీ బోజన్ తదితరులు నటించిన ఈ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్నాం, త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







