ఆఫ్రికా కు వీసా ఊరట
- January 21, 2016
గత కొంతకాలంగా ఇండియా నుంచి తగ్గుతున్న పర్యాటకులను ఆకర్షించడానికి దక్షిణాఫ్రికా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వీసాల జారీ ప్రకియను మరింత సరళం చేయడమే కాకుండా వినూత్నమైన పర్యాటక ప్యాకేజీలను కూడా ప్రవేశపెడుతోంది. 2010 నుంచి దక్షిణాఫ్రికాను సందర్శిస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోందని, దీనికి ప్రధాన కారణం వీసాల జారీలో జరుగుతున్న జాప్యంగా గుర్తించినట్లు సౌత్ఆఫ్రికా టూరిజం కంట్రీహెడ్ (ఇండియా) హన్నెలి స్లాబర్ తెలిపారు. రోడ్షోలో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇక నుంచి ఐదు రోజుల్లో వీసా లభించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఐదు రోజులు మిగిలిన పట్టణాల్లో గరిష్టంగా ఏడు రోజుల్లో వీసా జారీ చేయనున్నట్లు తెలిపారు. 2014లో 85,000 మంది భారతీయులు దక్షిణాఫ్రికాను సందర్శించారని, ఈ ఏడాది వీసాల జారీ సులభతరం కావడంతో ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దక్షిణాఫ్రికాలో సందర్శించడానికి ఉన్న ప్రాంతాలు, అవకాశాలపై అవగాహన కల్పించడానికి కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్, ముంబైల్లో 45 మంది ఎగ్జిబిటర్లు, 1,200 మంది టూర్ ఆపరేటర్లతో రోడ్షోలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సౌత్ఆఫ్రికా టూరిజం జనరల్ మేనేజర్ (ఇంటర్నేషనల్ మార్కెటింగ్) మోనికా లూయెల్ మాట్లాడుతూ సినిమా షూటింగ్లను ప్రోత్సహించడానికి అనేక రాయితీలను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే భారతీయులకు ఆహారపు అలవాట్లకు అనుగుణంగా జైన్, శాఖాహార వంటకాలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









