ఆఫ్రికా కు వీసా ఊరట
- January 21, 2016
గత కొంతకాలంగా ఇండియా నుంచి తగ్గుతున్న పర్యాటకులను ఆకర్షించడానికి దక్షిణాఫ్రికా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వీసాల జారీ ప్రకియను మరింత సరళం చేయడమే కాకుండా వినూత్నమైన పర్యాటక ప్యాకేజీలను కూడా ప్రవేశపెడుతోంది. 2010 నుంచి దక్షిణాఫ్రికాను సందర్శిస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోందని, దీనికి ప్రధాన కారణం వీసాల జారీలో జరుగుతున్న జాప్యంగా గుర్తించినట్లు సౌత్ఆఫ్రికా టూరిజం కంట్రీహెడ్ (ఇండియా) హన్నెలి స్లాబర్ తెలిపారు. రోడ్షోలో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇక నుంచి ఐదు రోజుల్లో వీసా లభించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముంబై, ఢిల్లీ నగరాల్లో ఐదు రోజులు మిగిలిన పట్టణాల్లో గరిష్టంగా ఏడు రోజుల్లో వీసా జారీ చేయనున్నట్లు తెలిపారు. 2014లో 85,000 మంది భారతీయులు దక్షిణాఫ్రికాను సందర్శించారని, ఈ ఏడాది వీసాల జారీ సులభతరం కావడంతో ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దక్షిణాఫ్రికాలో సందర్శించడానికి ఉన్న ప్రాంతాలు, అవకాశాలపై అవగాహన కల్పించడానికి కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్, ముంబైల్లో 45 మంది ఎగ్జిబిటర్లు, 1,200 మంది టూర్ ఆపరేటర్లతో రోడ్షోలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సౌత్ఆఫ్రికా టూరిజం జనరల్ మేనేజర్ (ఇంటర్నేషనల్ మార్కెటింగ్) మోనికా లూయెల్ మాట్లాడుతూ సినిమా షూటింగ్లను ప్రోత్సహించడానికి అనేక రాయితీలను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే భారతీయులకు ఆహారపు అలవాట్లకు అనుగుణంగా జైన్, శాఖాహార వంటకాలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







