కరోనా ఎఫెక్ట్: ఇంట్లో వుండాలని కోరుతున్న షార్జా పోలీస్ పెట్రోల్స్
- March 23, 2020
షార్జా పోలీస్, పెట్రోల్ కార్ల ద్వారా ప్రజల్లోకి వెళుతూ, ప్రజలు ఇళ్ళల్లోనే వుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్ళల్లోంచి బయటకు రావాలని షార్జా పోలీసులు విజఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు షార్జా పోలీసులు సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. మసీదు సమీపంలో నిలిపి వున్న పెట్రోల్ వాహనం, ఆ వాహనం నుంచి విన్పిస్తున్న ఆడియో మెసేజ్.. ఈ వీడియోలో కన్పిస్తున్నాయి. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్రజలు గుమికూడరాదనీ, పబ్లిక్ ప్లేసెస్లో తిరగరాదనీ పోలీసులు సూచిస్తున్నారు. ‘మీరు ఇంట్లో వుంటేనే అది మీకు ఆరోగ్యకరం..’ అని షార్జా పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









