మొలకెత్తిన గింజలతో ఆరోగ్యం..
- January 25, 2016
మొలకెత్తిన గింజలు వయసుతో పరిమితం లేకుండా.. అందరికీ ఆరోగ్యకరమే. కానీ.. చాలా మంది వీటిని ఇష్టపడరు. అయితే చిన్నా పెద్దా అందరూ సాయంకాలం గుప్పెడు మొలకెత్తిన గింజలు తీసుకుంటే.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్నో పోషకాలను దాచుకున్న మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవించేయవచ్చు.సాయంత్రం వేడి వేడి పకోడి, మిరపకాయ బజ్జీ, లొట్టలేసుకుంటూ తినే మంచూరియన్, చిప్స్, బర్గర్ వంటివి తినడానికి అందరూ ఎగబడుతూ ఉంటారు. అయితే ఇలాంటి హానికారక ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం కంటే.. మొలకెత్తిన గింజలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. కానీ ఫాస్ట్ ఫుడ్స్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మొలకెత్తిన గింజలకు ఇవ్వరు. అయితే మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల త్వరగా జీర్ణమవడమే కాకుండా.. శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా చూస్తుంది. కాబట్టి వారానికి ఒకసారైనా మొలకెత్తిన గింజలను డైట్ లో చేర్చుకోవడానికి ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. అవేంటో ఒకసారి చెక్ చేస్తే.. మీరు కూడా ఈ డైట్ ఫాలో అయిపోతారు.మొలకెత్తిన గింజల్లో విటమిన్స్, ఖనిజ లవణాలు, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శనగలు, వేరుశనగ, పెసర్లు, చిక్కుళ్లు, సోయా, అలసందలు వంటి వాటి ద్వారా పొందవచ్చు. కాబట్టి మొలకెత్తిన గింజలు తరచుగా తీసుకోవడం వల్ల యాక్టివ్ గా, హెల్తీగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.కొవ్వు పెరగకుండామధ్యాహ్నం మాంసాహారం తీసుకుంటే.. ఖచ్చితంగా సాయంత్రం మొలకెత్తిన గింజలు చేర్చుకోవాలి. దీనివల్ల మాంసాహారంలోని హానికారక కొవ్వు శరీరంలో పేరుకోకుండా జాగ్రత్తపడవచ్చు. మొలకెత్తిన గింజల్లో నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే ఎక్కువగా తినాలనే కోరికను అదుపు చేస్తుంది.జీర్ణక్రియమనం తీసుకున్న ఆహారంలోని కార్బొహైడ్రేట్స్ చక్కెరులుగా, ప్రొటీన్స్ ఎమినో యాసిడ్స్ గా, కొవ్వు పదార్థాలు కొవ్వు ఆమ్లాలుగా విడిపోతాయి. ఇలా విడిపోవడానికి సహకరించే ఎంజైమ్స్ మొలకెత్తిన గింజల్లో ఉంటాయి. గింజలను మొలకెత్తించడం వల్ల పోషకాలు మరింత పెరుగుతాయి. కాబట్టి వీటిని డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి.
ఎసిడిటిమొలకెత్తిన గింజలు తరచుగా తీసుకోవడం వల్ల ఎసిడిటి సమస్య దరిచేరదు. అలాగే గ్యాస్ర్టిక్ ట్రబుల్ సమస్య కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే మొలకెత్తిన గింజల్లో క్యాన్సర్ నివారించే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఏదో ఒకరకం కాకుండా.. రకరకాల గింజలను మొలకెత్తించి తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







