తెలంగాణ లో కొత్తగా 27 కోవిడ్-19 కేసులు
- May 20, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం రాష్ట్రంలో 27 కోవిడ్-19 కేసులు నమోదయినట్టు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, 12 మంది వలస శ్రామికులు కోవిడ్-19 వైరస్ బారిన పడినట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1661 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 89 మంది వలసజీవులు ఉన్నారని వెల్లడించింది. కోవిడ్ బాధితుల్లో ఇప్పటివరకు 1,013 మంది కోలుకున్నారని, ప్రస్తుతం 608 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. కోవిడ్-19తో ఇవాళ ఇద్దరు మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 40కి చేరింది. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాలేదని హెల్త్బులెటిన్లో ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు