తెలంగాణ లో కొత్తగా 27 కోవిడ్-19 కేసులు
- May 20, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం రాష్ట్రంలో 27 కోవిడ్-19 కేసులు నమోదయినట్టు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, 12 మంది వలస శ్రామికులు కోవిడ్-19 వైరస్ బారిన పడినట్టు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1661 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 89 మంది వలసజీవులు ఉన్నారని వెల్లడించింది. కోవిడ్ బాధితుల్లో ఇప్పటివరకు 1,013 మంది కోలుకున్నారని, ప్రస్తుతం 608 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. కోవిడ్-19తో ఇవాళ ఇద్దరు మృతి చెందడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 40కి చేరింది. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాలేదని హెల్త్బులెటిన్లో ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







