దుబాయ్‌ ట్యాక్సీ ప్లేట్‌ ఓనర్స్‌కి 1.5 బిలియన్ దిర్హామ్ ల‌ బోనస్‌

- May 22, 2020 , by Maagulf
దుబాయ్‌ ట్యాక్సీ ప్లేట్‌ ఓనర్స్‌కి 1.5 బిలియన్ దిర్హామ్ ల‌ బోనస్‌

దుబాయ్:దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, దుబాయ్‌ ట్యాక్సీ ప్లేట్స్‌ కలిగిన ఎమిరేటీ ఓనర్స్‌కి గత పదేళ్ళలో యూఏఈ ప్రైవ్‌ు మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, దుబాయ్‌ రూలర్‌ 1.5 బిలియన్‌ దిర్హామ్ ల  విలువైన బోనస్‌ అందించినట్లు తెలుస్తోంది. కమ్యూనిటీ వెల్‌ఫేర్‌ పట్ల షేఖ్‌ హమదాన్‌కి వున్న ప్రత్యేకమైన గౌరవానికి ఇది నిదర్శనమని ఆర్‌టిఎ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌ డైరెక్టర్‌ జనరల్‌ మట్టర్‌ మొహమ్మద్‌ అల్‌ తాయెర్‌ చెప్పారు. 2019 బోనస్‌ 51 మిలియన్‌ దిర్హామ్ ల  డిస్ట్రిబ్యూషన్‌కి రూలర్‌ ఆదేశించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు అల్‌ తాయెర్‌. మొత్తం 3,052 ట్యాక్సీ ప్లేట్స్‌ ఓనర్స్‌ దీని ద్వారా లబ్ది పొందనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com