రజనీకాంత్ పాస్పొర్ట్ మరిచిపోయారు..
- February 01, 2016
సూపర్స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' షూటింగ్ దశలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ మలేషియాలో జరగాల్సి ఉంది. ఇందు కోసం రజనీ సోమవారం ఉదయం 11.45 గంటలకు చెన్నై నుంచి మలేషియా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా ఎయిర్పోర్ట్కు చేరుకున్న అనంతరం ఆఖరి నిమిషంలో తాను పాస్పోర్ట్ మరిచిపోయినట్టు తెలుసుకున్నారు. దీంతో ఆయనతోపాటు చిత్రయూనిట్లోని కొందరు సభ్యులు, నిర్మాత కలైపులి ఎస్.థానులు కొంత సేపు కంగారు పడ్డారు. అయితే రజనీ వెంటనే తన సహాయకులకు ఫోన్ చేసి ఇంటి నుంచి పాస్పోర్ట్ను తెప్పించుకున్నారు. అదే సమయానికి విమానాన్ని కూడా అందుకోగలిగారు.ఈ విషయం తెలుసుకున్న మీడియా, రజనీ అభిమానులు కొంత సేపు హల్ చేశారు. చివరికి అంతా ప్రశాంతంగా సర్దుకున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







