దుబాయ్:మోసాలకు పాల్పడుతున్న 20 గ్యాంగులు..47 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- July 01, 2020
దుబాయ్:మాయదారి మాటలు, డేటింగ్ లింకులతో ప్రజలను మోసం చేస్తున్న అఫ్రికన్ గ్యాంగ్ ఆటకట్టించారు దుబాయ్ పోలీసులు. ప్రజల్ని మోసం చేస్తున్న 20 గ్యాంగులను గుర్తించి అందులోని 47 మంది సభ్యుల్ని అరెస్ట్ చేశారు. ప్రజల బలహీనతల్ని అవకాశంగా మలుచుకొని కట్టుకథలతో ప్రజలను లూటీ చేస్తున్నాయి ఆఫ్రికన్ గ్యాంగులు. సైబర్ నేరాలు, మోసాలు, దోపిడి, బ్లాక్ మెయిలింగ్ ఇలా అన్ని రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. చివరికి లాక్ డౌన్ సమయంలో అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసిన ఘటనను కూడా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇళ్లలో పని చేసేందుకు కార్మికులను రిక్రూట్ చేస్తామంటూ కొందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత వాళ్లను హ్యాండ్ ఇచ్చారు. ఓ జంట ఇలా డొమస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. కొన్ని డేటింగ్ లింకులను పంపించి..యువతను వలలోకి దించి సైబర్ నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఆపరేషన్ క్రైమ్ ఆఫ్ షాడోతో ఆఫ్రికన్ ముఠాలను పట్టుకున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన లింకుల జోలికి వెళ్లొద్దని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే మెసేజ్ లకు కూడా స్పందించొద్దని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







