చైనీస్ సోషల్ మీడియా 'వీబో' నుంచి తప్పుకున్న మోదీ
- July 01, 2020
న్యూ ఢిల్లీ:59 చైనా యాప్ లను రద్దు చేసిన మోదీ సర్కార్ ఈ రోజు వీబో అకౌంట్ ను తొలగించారు. 2015లో చైనాలో పర్యటించిన ప్రధాని విబో ఖాతాను తెరిచారు. అయితే ప్రస్తుత పరిస్తితులు చైనాకు అనుకూలంగా లేనందున వీబో అకౌంట్ లో గతంలో పెట్టిన ప్రొఫైల్ ఫోటోతో పాటు పూర్తి వివరాలను, కామెంట్లను, పోస్టులను అన్నింటినీ తొలగించారు. ఈ రోజు ఆ పేజి బ్లాంక్ గా ఉందని అధికారులు ప్రకటించారు. వీబోలో మోదీకి 2,44,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది చైనీయులే ఉండడం గమనార్హం. చైనా భాషలోనే మోదీ వారితో సంభాషణ నెరపేవారు. 2015 నుండి భారత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పుట్టిన రోజు జూన్ 15 సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు అందజేసేవారు. కానీ ఈ ఏడాది జిన్ పింగ్ కు మోదీ శుభాకాంక్షలు తెలపలేదు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







