బహ్రెయిన్:ఇక మధ్యాహ్నం వేళలో పని నిషేధం..నిబంధనలు అతిక్రమిస్తే 3 నెలల జైలు
- July 01, 2020
మనామా:సమ్మర్ ఎండలు తీవ్రం కావటంతో కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు బహ్రెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి మధ్యాహ్నం వేళల్లో ఖచ్చితంగా కార్మికులకు విశ్రాంతి కల్పించాల్సిందేనని ఆదేశించింది. ప్రతి యేటా వేసవిలో కార్మికులకు మధ్యాహ్న విరామం ప్రకటిస్తున్న విషయం తెలిసింది. జులై, ఆగస్ట్ నెలలో సాయంత్రం 4 గంటల వరకు కార్మికులకు ఎండ తగిలే ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశ్రాంతి ఇవ్వాలని కార్మిక, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించింది. వేడి వాతావరణాన్ని తట్టుకునేలా కార్మికులకు తగిన ఏర్పాటు చేయాలంది. మొత్తం దేశంలోని 30 వేల కంపెనీలు, సంస్థల్లో మధ్యాహ్న పనివేళలపై నిషేధం ఖచ్చితంగా అమలయ్యేలా తాము పర్యవేక్షిస్తామని కార్మిక శాఖ వెల్లడించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష, BD500 జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది. కార్మిక శాఖ నిబంధనలను ఏవైనా కంపెనీలు, సంస్థలు ఉల్లంఘించిన్టలు గుర్తిస్తే వెంటనే 17873648కి ఫోన్ చేసి తమకు సమాచారం అందించాలని, ఇదే హాట్ లైన్ నెంబర్ కు కార్మికులు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేవచ్చని కార్మిక శాఖ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







