బహ్రెయిన్:ఇక మధ్యాహ్నం వేళలో పని నిషేధం..నిబంధనలు అతిక్రమిస్తే 3 నెలల జైలు
- July 01, 2020
మనామా:సమ్మర్ ఎండలు తీవ్రం కావటంతో కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు బహ్రెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి మధ్యాహ్నం వేళల్లో ఖచ్చితంగా కార్మికులకు విశ్రాంతి కల్పించాల్సిందేనని ఆదేశించింది. ప్రతి యేటా వేసవిలో కార్మికులకు మధ్యాహ్న విరామం ప్రకటిస్తున్న విషయం తెలిసింది. జులై, ఆగస్ట్ నెలలో సాయంత్రం 4 గంటల వరకు కార్మికులకు ఎండ తగిలే ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశ్రాంతి ఇవ్వాలని కార్మిక, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించింది. వేడి వాతావరణాన్ని తట్టుకునేలా కార్మికులకు తగిన ఏర్పాటు చేయాలంది. మొత్తం దేశంలోని 30 వేల కంపెనీలు, సంస్థల్లో మధ్యాహ్న పనివేళలపై నిషేధం ఖచ్చితంగా అమలయ్యేలా తాము పర్యవేక్షిస్తామని కార్మిక శాఖ వెల్లడించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష, BD500 జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది. కార్మిక శాఖ నిబంధనలను ఏవైనా కంపెనీలు, సంస్థలు ఉల్లంఘించిన్టలు గుర్తిస్తే వెంటనే 17873648కి ఫోన్ చేసి తమకు సమాచారం అందించాలని, ఇదే హాట్ లైన్ నెంబర్ కు కార్మికులు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేవచ్చని కార్మిక శాఖ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









