మస్కట్:మద్యం ఉత్పత్తులపై 100 శాతానికి పన్ను పెంపు
- July 02, 2020
మస్కట్:మద్యం ఉత్పత్తులపై పన్ను శాతాన్ని రెట్టింపు చేసింది ఒమన్ ప్రభుత్వం. ఇక నుంచి ఎంపిక చేసిన మద్యం ఉత్పత్తులపై 100 శాతం పన్ను వసూలు చేయనున్నారు. నిన్నటి నుంచే కొత్త ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే..పన్ను మినహాయింపు పొందిన షాపులకు మాత్రం ఈ కొత్త ట్యాక్స్ విధానం వర్తించదు. మద్యం ఉత్పత్తులతో పాటు ఎనర్జీ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, మాంసం ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులపై వంద శాతానికి పన్నును పెంచింది. నిజానికి గతేడాదిలోనే ఈ ఉత్పత్తులు అన్నింటిపై వంద శాతం పన్ను వసూలు చేశారు. అయితే.. కొన్నాళ్ల త్వర్వాత వ్యాపారులకు ఊరటనిస్తూ పన్నును 50 శాతానికి తగ్గించింది ఒమన్ ప్రభుత్వం. ఇప్పుడా మినహాయింపును మళ్లీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచే 100 శాతం పన్ను విధానం అమలులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







