మస్కట్:మద్యం ఉత్పత్తులపై 100 శాతానికి పన్ను పెంపు
- July 02, 2020
మస్కట్:మద్యం ఉత్పత్తులపై పన్ను శాతాన్ని రెట్టింపు చేసింది ఒమన్ ప్రభుత్వం. ఇక నుంచి ఎంపిక చేసిన మద్యం ఉత్పత్తులపై 100 శాతం పన్ను వసూలు చేయనున్నారు. నిన్నటి నుంచే కొత్త ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే..పన్ను మినహాయింపు పొందిన షాపులకు మాత్రం ఈ కొత్త ట్యాక్స్ విధానం వర్తించదు. మద్యం ఉత్పత్తులతో పాటు ఎనర్జీ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, మాంసం ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులపై వంద శాతానికి పన్నును పెంచింది. నిజానికి గతేడాదిలోనే ఈ ఉత్పత్తులు అన్నింటిపై వంద శాతం పన్ను వసూలు చేశారు. అయితే.. కొన్నాళ్ల త్వర్వాత వ్యాపారులకు ఊరటనిస్తూ పన్నును 50 శాతానికి తగ్గించింది ఒమన్ ప్రభుత్వం. ఇప్పుడా మినహాయింపును మళ్లీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచే 100 శాతం పన్ను విధానం అమలులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







