మస్కట్:మద్యం ఉత్పత్తులపై 100 శాతానికి పన్ను పెంపు
- July 02, 2020
మస్కట్:మద్యం ఉత్పత్తులపై పన్ను శాతాన్ని రెట్టింపు చేసింది ఒమన్ ప్రభుత్వం. ఇక నుంచి ఎంపిక చేసిన మద్యం ఉత్పత్తులపై 100 శాతం పన్ను వసూలు చేయనున్నారు. నిన్నటి నుంచే కొత్త ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే..పన్ను మినహాయింపు పొందిన షాపులకు మాత్రం ఈ కొత్త ట్యాక్స్ విధానం వర్తించదు. మద్యం ఉత్పత్తులతో పాటు ఎనర్జీ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, మాంసం ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులపై వంద శాతానికి పన్నును పెంచింది. నిజానికి గతేడాదిలోనే ఈ ఉత్పత్తులు అన్నింటిపై వంద శాతం పన్ను వసూలు చేశారు. అయితే.. కొన్నాళ్ల త్వర్వాత వ్యాపారులకు ఊరటనిస్తూ పన్నును 50 శాతానికి తగ్గించింది ఒమన్ ప్రభుత్వం. ఇప్పుడా మినహాయింపును మళ్లీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచే 100 శాతం పన్ను విధానం అమలులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









