తొలి స్వదేశీ సోషల్ మీడియా యాప్ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
- July 05, 2020
న్యూ ఢిల్లీ:సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకున్న వేళ చైనాకు సరైన గుణపాఠం చెప్పాలని భారత్ సంకల్పించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ యాప్ల రూపకల్పన ఊపందుకుంది. తొలి దేశీయ సోషల్ మీడియా సూపర్ యాప్ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు.ఎలిమెంట్స్ యాప్ను విర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు.. విదేశీ యాప్లకు దీటుగా నిలవాలని ఆకాంక్షించారు. ఇలాంటి దేశీయ యాప్లు మరిన్ని రావాలని ఆయన అన్నారు. గురు పౌర్ణమి రోజున యాప్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఉప రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







