బహ్రెయిన్ నుంచి 25 వేల ఇండియన్లను తరలించేందుకు జాబితా సిద్ధం
- July 05, 2020మనామా:వందేభారత్ మిషన్ లో భాగంగా బహ్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. దాదాపు 25 వేల మంది కార్మికులను ఇండియా తీసుకొచ్చేందుకు జాబితా సిద్ధం చేసినట్లు మనమాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. స్వదేశానికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్న 25 వేల మందిని జాబితా అధారంగా దశల వారీగా తరలిస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 8000 మందిని బహ్రెయిన్ నుంచి భారత్ కు తరలించినట్లు వివరించారు. బహ్రెయిన్ లో ఉన్న ప్రవాసీయుల్లో అత్యధిక శాతం భారతీయులే. దాదాపు 4.50 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు భారతీయులు ఉన్నట్లు అంచనా. అయితే..ఇప్పటివరకు బహ్రెయిన్ లో కరోనా బారిన పడి 270 మంది మరణించారు. కరోనా తీవ్రత పెరగటంతో ఆందోళన చెందుతున్న కార్మికులు తిరిగి ఇండియా వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ