నేడు ప్రధానిని కలవనున్న బాబు ...
- February 08, 2016
కేంద్ర ప్రభుత్వం 2016-17 బడ్జెట్పై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ బయలుదేరారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అంతకుముందు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీతోపాటు, వివిధ కేంద్రమంత్రులను విడివిడిగా కలుస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రధానితో సమావేశం కానున్నారు. ఉదయం 10.30 గంటలకు పర్యాటక శాఖ మంత్రి మహేశ్శర్మ, 12 గంటలకు రైల్వే మంత్రి సురేశ్ప్రభు, 2.30 గంటలకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్, 3.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, సాయంత్రం 6.30 గంటలకు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీలతో భేటీ అవుతారు. విభజన అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని గట్టునవేసేలా సాయం చేయాలని కోరబోతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







