నేడు ప్రధానిని కలవనున్న బాబు ...

- February 08, 2016 , by Maagulf
నేడు ప్రధానిని కలవనున్న బాబు ...

కేంద్ర ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ బయలుదేరారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అంతకుముందు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతోపాటు, వివిధ కేంద్రమంత్రులను విడివిడిగా కలుస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రధానితో సమావేశం కానున్నారు. ఉదయం 10.30 గంటలకు పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మ, 12 గంటలకు రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు, 2.30 గంటలకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌, 3.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సాయంత్రం 6.30 గంటలకు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీలతో భేటీ అవుతారు. విభజన అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని గట్టునవేసేలా సాయం చేయాలని కోరబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com