ఎన్ టీఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా నామకరణం..
- February 09, 2016
విజయవాడ నగరంలోని లబ్బీపేటలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మరో నెల రోజులలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.3.08 కోట్ల వ్యయంతో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుమారు మరో రూ.ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ ఆధునిక పశువ్యాధుల నిర్ధారణ పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. తాజాగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఎంపీ హరికృష్ణ నిధులను ఎంపీ ల్యాడ్స్ నుంచి వినియోగించారు. తొలుత ఆయన పేరే పెడదామన్న ఆలోచన వచ్చింది. అయితే ఇప్పుడు నందమూరి తారకరామరావు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో పోలీసు కమిషనర్గా ఉన్న సురేంద్రబాబు పశువుల ఆస్పత్రిని నిర్మించిన స్ధలాన్ని పోలీసు పేరెడ్ గ్రౌండ్కోసం కావాలని దరఖాస్తు చేసి జీవో తెప్పించారు.అయితే దీనిపై రైతులు, పశు సంవర్ధకులు ఆందోళన చేయడంతో అప్పటి సీఎం ఎనటీఆర్ పోలీసుల కోసం ఇచ్చిన జీవోను రద్దు చేసి పశు సంవర్ధక శాఖకే అప్పగించారు. దీంతో ఆయన స్మృతి చిహ్నంగా ఆయన పేరు పెట్టారు. మరో నెల రోజులలో సూపర్ స్పెషాలిటీ పశువుల ఆస్పత్రిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జేడి దామోదరనాయుడు ఆంధ్రజ్యోతితో చెప్పారు. ఇప్పుడు భవనంలోకి పశు సంవర్ధక శాఖ సంచాలకుడి కార్యాలయంతోపాటు ఆస్పత్రి కూడా ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









