అగ్రిగోల్డ్‌ యజమానులకు 14 రోజుల రిమాండ్‌ ..

- February 12, 2016 , by Maagulf
అగ్రిగోల్డ్‌ యజమానులకు 14 రోజుల రిమాండ్‌ ..

సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్‌ కేసుకు సంబంధించి ఆ సంస్ధ యజమానులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిన్న రాత్రి అరెస్టయిన అగ్రిగోల్డ్‌ ఫార్మ్‌ ఎస్టేట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌, సీఎండీ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయణవులను ఈరోజు వేకువజామున పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తీసుకొచ్చారు.కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు స్థానిక పోలీస్‌ గెస్ట్‌హౌస్‌కు తీసుకువచ్చి, కోర్టు సమయం వరకు వేచి ఉంచారు. ఉదయం 10గంటల సమయంలో జిల్లా న్యాయమూర్తుల నివాస సముదాయానికి తరలించి, రెండో అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ హరినాథ శర్మ ఎదుట హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో నిందితులిద్దరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏలూరు సబ్‌జైలుకు తరలించారు. కేసు విచారణ నిమిత్తం నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అగ్రిగోల్డ్‌ యజమానులను ఆసుపత్రికి తీసుకొచ్చిన విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అగ్రిగోల్డ్‌ బాధితులు ఎవరూ భయపడొద్దని, అందరికీ న్యాయం చేస్తాననిఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ ఛైర్మన్‌ వెంకటరామారావు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com