బాహుబలి సినిమాను 6000 స్క్రీన్స్ మీద రిలీజ్ చేయడానికి ప్లాన్
- February 12, 2016
బాహుబలి సినిమా రిలీజ్ అయి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సినిమా హవా కనిపిస్తూనే ఉంది. 2015 జూలైలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ తన సంచలనాలను నమోదు చేస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల వరకు వసూలు చేసిన బాహుబలి.. ఇప్పుడు మరోసారి భారీ రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ్, మళయాలం, హిందీతో పాటు ఇతర దేశభాషల్లో కూడా రిలీజ్ అయిన బాహుబలి ఇప్పుడు ఏకంగా 6000 స్క్రీన్స్ మీద రిలీజ్ కు రెడీ అవుతోంది.వినోద రంగానికి భారీ మార్కెట్ ఉన్న చైనాలో బాహుబలి సినిమాను భారీగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. పికె సినిమాను చైనాలో రిలీజ్ చేసిన ఇ స్టార్ ఫిలింస్ సంస్థతో కలిసి బాహుబలి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.అంతేకాదు పికె సినిమాను 5000 స్క్రీన్స్ మీద రిలీజ్ చేసిన ఈ సంస్ధ బాహుబలి సినిమాను 6000 స్క్రీన్స్ మీద రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. దీంతో కలెక్షన్ల విషయంలో బాహుబలి మరో రికార్డ్ సెట్ చేయటం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాహుబలి సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం రెండో భాగం చిత్రీకరణ జరుపుకుంటోంది. మరింత భారీగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి 2ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







