మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
హైదరాబాద్ :తెలంగాణ మొట్టమొదటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయి. వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఆయన ఆరోగ్యంగా కోలుకుని తిరిగి వస్తారని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణ వార్త అందరిని తీవ్ర బాధల్లోకి నెట్టేసింది.నాయిని మృతికి సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్.. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నాయినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లుకు సూచించారు. కానీ ఇంతలోనే ఆయన మరణించారన్న వార్త అందడంతో.. ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.