దేశం విడిచి వెళ్ళేందుకు సిద్ధమైన 7,000 మంది వలసదారులు
- November 21, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం 7,689 మంది వలసదారులు, దేశం విడిచి వెళ్ళేందుకు సిద్ధంగా వున్నారని తెలుస్తోంది. ఎలాంటి జరీమానాలూ చెల్లించకుండా వలసదారులు దేశం విడిచి వెళ్ళేందుకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నవంబర్ 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, నమోదు చేసుకున్నవారిలో 3263 మంది వలసదారులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. 408 మందికి వర్క్ పర్మిట్లు లేవు. 253 మంది వర్క్ పర్మిట్స్ రద్దయ్యాయి. కాగా, 3,765 మంది వర్క్ పర్మిట్లు యాక్టివ్గా వున్నప్పటికీ వారు దేశం విడిచి వెళ్ళాలనుకుంటున్నారు. కాగా, 93 మందికి ఫ్యామిలీ వీసాలు కూడా కలిగి వుండడం గమనార్హం. 87 ఫ్యామిలీ జాయినింగ్ వీసాలు, 147 విజిట్ వీసాలు, 12 టూరిస్ట్ వీసాలు, 7289 వర్క్ వీసాలు కలిగినవారు వుండగా, 61 మంది వద్ద డాక్యుమెంట్లు లేవు. డిసెంబర్ 31 వరకు ఈ స్కీం అందుబాటులో వుంటుంది. ఎంబసీలు, మినిస్ట్రీ వెబ్సైట్ అలాగే సనద్ సెంటర్లలో రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పిస్తున్నారు. చెల్లుబాటయ్యే టిక్కెట్ అలాగే పిసిఆర్ టెస్ట్ తప్పనిసరిగా వుండాలి దేశం విడిచి వెళ్ళాలనుకునేవారికి.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









