రస్ అల్ ఖైమా కు విమానాల్ని ప్రారంభించనున్న స్పైస్జెట్
- November 21, 2020
యూఏఈ: నవంబర్ 26న తొలి కమర్షియల్ విమానం ఇండియా నుంచి (కరోనా పాండమిక్ మొదలయిన తర్వాత) రస్ అల్ ఖైమా విమానాశ్రయంలో దిగనుందని ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. వారానికి రెండు సార్లు స్పైస్జెట్ విమానాలు ఇండియా - రస్ అల్ ఖైమా మధ్య తిరగనున్నాయి. ఇండియాలోని ఢిల్లీలోగల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్పైస్జెట్ విమానాలు కనెక్ట్ చేయనున్నాయి. 189 మంది ప్రయాణీకు సామర్థ్యంతో బోయింగ్ 737-800 విమానాలు ఈ సర్వీసుల్ని అందిస్తాయి. గురువారం అలాగే శనివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరతాయి. శుక్రవారం ఉదయం అలాగే సోమవారం ఉదయం ఈ విమానాలు రస్ అల్ ఖైమా చేరుకుంటాయి. సోమవారం అలాగే శుక్రవారం ఈ విమానాలు ఢిల్లీలో తిరిగి ల్యాండ్ అవుతాయి.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









