పసిడి ధర పెరిగింది..
- February 19, 2016
బంగారం ధర నిన్న కాస్త తగ్గినప్పటికీ ఈరోజు మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, దేశీయంగా బంగారం వ్యాపారస్తుల నుంచి డిమాండ్ పెరగడంతో పసిడి ధర ఈరోజు రూ.29వేలు దాటింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.540 పెరిగి రూ.29,290కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1230.70 అమెరికా డాలర్లుగా ఉంది. వెండి ధర కూడా ఈరోజు పెరిగింది. కిలో వెండి ధర రూ.375 పెరిగి రూ.37,475కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వెండి ధర కూడా పెరిగినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







