గన్నవరం విమానాశ్రయం విస్తరణపై ఏపీ సర్కార్ ఫోకస్
- December 24, 2020
గన్నవరం విమానాశ్రయం విస్తరణ సమస్యల పరిష్కారంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణలో ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు రూ. 112.75 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. బుద్దవరం, దావాజీగూడెం, అల్లపురం గ్రామాల్లో విమానాశ్రయ విస్తరణ కారణంగా ప్రభావితమయ్యే 423 కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపును పూర్తి చేసింది ప్రభుత్వం. అజ్జంపూడి గ్రామంలో విస్తరణ ప్రభావిత కుటుంబాలకు ప్లాట్లను కేటాయించిన ప్రభుత్వం.... కేటాయించిన ప్లాట్లల్లో ప్రభావిత కుటుంబాలే సొంతంగా ఇళ్లను నిర్మించుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభావిత కుటుంబాలకు రూ. 57.20 కోట్ల మేర పరిహారాన్ని అందజేయాలని నిర్ణయం తీసుకుంది. యాన్యూటీ నిమిత్తం రూ. 42.94 కోట్ల కేటాయింపు చేసింది. రక్షిత మంచి నీటి ట్యాంకు.. విద్యుత్ హెటెన్షన్ లైన్ల ఏర్పాటు, భూసేకరణ వంటి అంశాలకు నిధులను కేటాయించింది ఏపీ సర్కార్.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







