జగిత్యాలలో గల్ఫ్ కార్మికుల ధర్నా,రాస్తా రోకో...
- January 03, 2021
గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్, మరికొందరిని అదుపులోకి తీసుకున్న జగిత్యాల పోలీసులు
రాష్ట్రం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి
కేంద్రం వేతన తగ్గింపు సర్కులర్లను వాపస్ తీసుకోవాలి
తెలంగాణ:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ జారీచేసిన సర్కులర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో ఆదివారం జగిత్యాల కొత్త బస్ స్టాండ్ చౌరస్తా లో గల్ఫ్ కార్మికులు నిరసన ప్రదర్శన, రాస్తా రోకో నిర్వహించారు.

రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు చేయాలి చేయాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సహాయం చేయాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎస్. నరేష్ రెడ్డి, ఎద్దండి భూమయ్య, సూదవేని గంగాధర్, మల్యాల శేఖర్ గౌడ్, అమరగోని తిరుపతి, దుర్గ ప్రసాద్, అలీం, పరమేష్ రావు, బద్దం వినయ్, కల్లెడ వినయ్, తీపిరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









