జగిత్యాలలో గల్ఫ్ కార్మికుల ధర్నా,రాస్తా రోకో...
- January 03, 2021
గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్, మరికొందరిని అదుపులోకి తీసుకున్న జగిత్యాల పోలీసులు
రాష్ట్రం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి
కేంద్రం వేతన తగ్గింపు సర్కులర్లను వాపస్ తీసుకోవాలి
తెలంగాణ:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ జారీచేసిన సర్కులర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో ఆదివారం జగిత్యాల కొత్త బస్ స్టాండ్ చౌరస్తా లో గల్ఫ్ కార్మికులు నిరసన ప్రదర్శన, రాస్తా రోకో నిర్వహించారు.

రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు చేయాలి చేయాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సహాయం చేయాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎస్. నరేష్ రెడ్డి, ఎద్దండి భూమయ్య, సూదవేని గంగాధర్, మల్యాల శేఖర్ గౌడ్, అమరగోని తిరుపతి, దుర్గ ప్రసాద్, అలీం, పరమేష్ రావు, బద్దం వినయ్, కల్లెడ వినయ్, తీపిరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







