మోదీ డాక్టరేట్‌ను తిరస్కరించారు

- February 22, 2016 , by Maagulf
మోదీ డాక్టరేట్‌ను తిరస్కరించారు

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గౌరవ డాక్టరేట్‌ను సున్నితంగా తిరస్కరించారు. తనకు ఈ విశ్వవిద్యాలయం ఎన్నో ఇచ్చిందని, వాటి ముందు డాక్టరేట్ తక్కువేనన్నారు. డాక్టరేట్‌ను తిరస్కరిస్తున్నందుకు వర్సీటీ అధ్యాపకులు తనను క్షమించాలని ఆయన కోరారు. గతంలోనూ మోదీ అమెరికాలో పర్యటించినపుడు లూసియానా వర్శిటీలో డాక్టరేట్‌ను తిరస్కరించారు. గుజరాత్ సిఎంగా ఉన్నపుడు కూడా ఆయన డాక్టరేట్ల పట్ల ఆసక్తి చూపలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com