భారత్ లో కరోనా కేసుల వివరాలు

- February 19, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.ముఖ్యంగా మహారాష్ట్రలో రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.కేరళ, మహారాష్ట్రలో మినహా మిగతా ప్రాంతాల్లో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 13,193 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,63,394కి చేరింది.ఇందులో 1,06,67,741 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39,542 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 97 మంది మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,56,111కి చేరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com